రిజెక్షన్ కేసుల్లో.. వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ : పాలసీ బజార్

రిజెక్షన్ కేసుల్లో..  వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ : పాలసీ బజార్

హైదరాబాద్​, వెలుగు: తమ ప్లాట్​ఫామ్ ​నుంచి పాలసీలు తీసుకున్న వాళ్లు ఇన్సూరెన్స్​ డబ్బు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే అన్ని విధాలా  సాయపడతామని పాలసీ బజార్ జాయింట్ గ్రూప్ సీఈఓ సర్భవీర్ ప్రకటించారు. ఈ ప్రక్రియను సజావుగా, వేగంగా చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

క్లెయిమ్ సమాధాన్ దివస్ వంటి కార్యక్రమాలు,  ప్రత్యేక బృందాల ద్వారా వేల సంఖ్యలో కేసులను మళ్లీ తెరిపించామని, రూ.కోట్ల   విలువైన క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పరిష్కారమయ్యేలా చేశామని పేర్కొన్నారు. ఏ క్లెయిమ్ అయినా అన్యాయంగా తిరస్కరించకుండా, నిలిచిపోకుండా చూస్తామన్నారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాలసీబజార్ శుక్రవారం నిర్వహించిన 'ఇన్సూరెన్స్ కా సూపర్  హీరో’ నాలుగో ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘జీఎస్టీ తగ్గించడంతో మా ప్లాట్​ఫామ్​ ద్వారా గత రెండు నెలల నుంచి పాలసీల కొనుగోళ్లు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా పాలసీ తక్కువ రేట్లకు దొరుకుతోంది. ఎక్కువ మంది రూ.30వేల లోపు ప్లాన్​ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రీ ఎగ్జిస్టింగ్​డిసీజెస్ ​వంటి సమస్యల వల్ల క్లెయిమ్​ తిరస్కరణలు పెరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో మోసాలూ బయటపడుతున్నాయి”అని ఆయన వివరించారు.