- సిలిండర్బొమ్మల ఏర్పాటుపై మహిళల ఆగ్రహం
హుజూరాబాద్, వెలుగు: బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని సైతం రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చడంపై మహిళలు మండిపడ్డారు. హుజూరాబాద్లో బతుకమ్మ వేడుకలు జరుపుకొనే చోట, చావడికి చేరుకునే దారిలో గ్యాస్ సిలిండర్ల రూపంలో బొమ్మలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంచారు. గ్యాస్రేట్లు పెంచారంటూ దానిపై రాశారు. బతుకమ్మలను తీసుకొని వస్తున్న పలువురు మహిళలు వాటిని చూసి ఇక్కడ సైతం రాజకీయాలేంటని విసుక్కున్నారు. విషయాన్ని పలువురు ఫిర్యాదు చేయడంతో పట్ణణ సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని మున్సిపల్ సిబ్బంది సహకారంతో తీసివేశారు. కాగా బతుకమ్మ వేడుకలకు వెళ్లే దారిలో పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. వెహికల్స్ను లోపలికి అనుమతించలేదు. అయితే వీటిని ఎవరు తీసుకువచ్చారో గుర్తించి పండుగను రాజకీయాలకు వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు డిమాండ్చేశారు.