- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ.. 11న నోటిఫికేషన్
- కడియం శ్రీహరి, కౌశిక్రెడ్డి రాజీనామాతో రెండు సీట్లకు ఉప ఎన్నిక
న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో రెండు, యూపీలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీకాలం 2027 నవంబర్30 వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. 19న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుంది.
ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలో పోలింగ్నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి ఒకటో తేదీతో పూర్తికానుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కే చాన్స్..
అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్కు 64 మంది, బీఆర్ఎస్కు 39 మంది, బీజేపీకి 8 మంది ఉన్నారు. ఎంఐఎంకు ఏడుగురు, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క సెట్నామినేషన్దాఖలు చేయడానికి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. ఈ లెక్కన నామినేషన్లు దాఖలు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్కు మాత్రమే అవకాశముంది. సభ్యుల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్, బీఆర్ఎస్ఒక్కో స్థానాన్ని గెలిచుకునే చాన్స్ ఉంది. కాంగ్రెస్నుంచి ఇద్దరు, బీఆర్ఎస్నుంచి ఒక్కరు నామినేషన్దాఖలు చేస్తే పోలింగ్అనివార్యమవుతుంది. రెండు పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్వేస్తే నామినేషన్ల ఉప సంహరణ గడువు పూర్తయిన తర్వాత వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.