పోలింగ్​ శాతం పెంచాలి .. బల్దియా కమిషనర్ రోనాల్డ్​ రోస్

పోలింగ్​ శాతం పెంచాలి ..   బల్దియా కమిషనర్ రోనాల్డ్​ రోస్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభతోపాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్​చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుధవారం బుద్ధ భవన్ లో ఏఆర్ఓలు, ఎన్నికలు విభాగం అధికారులు, స్వీప్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 25 రోజుల పాటు స్వీప్ కార్యక్రమాలు విస్తృతం నిర్వహించాలని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్​వైజర్లు, సెక్టోరల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటరును చైతన్య పరచాలన్నారు.