జీడిమెట్ల, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ క్లీన్ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ)ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. సనత్నగర్లోని రాష్ట్ర పీసీబీ కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్. రజత్ కుమార్ పీసీబీపై గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం కింద 2019 నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
గ్రీన్బెల్టులను అభివృద్ధి చేయడం, స్మార్ట్ లైట్స్ప్రవేశపెట్టడం, బ్లాక్టాప్రోడ్డు, మెకనైజ్డ్ స్వీపింగ్ చేయడం వల్ల తెలంగాణలో గాలి నాణ్యత మెరుగుపడిందన్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్నగరంలో గాలిలో దూళి సాంద్రత 11శాతం తగ్గిందన్నారు. మురుగునీటి శుద్ధి 2023 నాటికి 1259 ఎం.ఎల్.డీలు పెంచుతామన్నారు. తద్వారా చెరువుల్లో నీటి నాణ్యత పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో పలు రంగాల్లోని నిపుణులతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు.