కర్నాటక, తమిళనాడు సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా పొంగులేటి

కర్నాటక, తమిళనాడు సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా పొంగులేటి
  • 23 రాష్ట్రాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలను ప్రకటించిన బీజేపీ 

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాలకు/యూటీలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలు, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లను నియమించింది. ఇందులో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు లోక్‌‌‌‌‌‌‌‌సభ సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా పొంగులేటి సుధాకర్ రెడ్డిని అపాయింట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశంతో మొత్తం 23 రాష్ట్రాలు/యూటీలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులు, సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలను నియమించామని తెలిపారు.