తొర్రూరు, వెలుగు : మున్సిపల్ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర గృహ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అభ్యర్థించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీ పీసీసీ వైస్ప్రెసిడెంట్ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో శనివారం మహబూబాబాద్జిల్లా తొర్రూరు ఒకటి, రెండో వార్డులో పార్టీ అభ్యర్థులు తాళ్లపల్లి శ్రీలత, తూనం శ్రావణ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. తొర్రూరును దత్తత తీసుకొని మోడల్గా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
