100 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ను బొందపెడ్తం: పొంగులేటి

100 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ను బొందపెడ్తం: పొంగులేటి

ఖమ్మం జనగర్జన సభను అడ్డుకోవడంలో  పోలీసులు, బీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వం  ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జనం తరలివచ్చి సభను విజయవంతం చేశారని చెప్పారు. అధికార పార్టీ సభ పెడితే జనం లేక వెలవెలబోయిందని.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నే రీతిలో తాము సభను నిర్వహించామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పదికి పది , రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ను బొంద పెడ్తామన్నారు. పువ్వాడ సూచనలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని..ఆయన కంటే తెలివైనోళ్లు  కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారని చెప్పారు.

జనగర్జన సభ గురించి మాట్లాడే  అధికార పార్టీ నేతల కళ్లకు పచ్చ కామెర్లు వచ్చాయన్నారు పొంగులేటి.  బీఆర్ఆఎస్  నేతలు కంటి వెలుగు పథకాన్ని వినియోగించుకుని అద్ధాలు వాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కుమారుడు వస్తే ప్రభుత్వం కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదన్నారు.  కేసీఆర్ నీతిమాలిన పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఫాంహౌజ్ కే పరిమితం చేయాలని భావించినప్పుడు కాంగ్రెస్ సభలు ఇలాగే విజయవంతం అవుతాయన్నారు. బీఆర్ఎస్ హిట్లర్ లా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు తాగిన మైకంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.