కేసీఆర్ కిలాడీ రాజకీయాలు మానుకోవాలి

కేసీఆర్ కిలాడీ రాజకీయాలు మానుకోవాలి

సీఎం కేసిఆర్ కిలాడీ రాజకీయాలు మానుకోవాలన్నారు.. మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. హుజూరాబాద్ ఓటమిని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేయించిన ఘనత టీఆరెఎస్ దే అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ నాయకులు తమ వల్లే కేంద్రం దిగొచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామన్నా రాష్ట్రంలో వడ్లు ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు పొంగులేటి. రైతు పక్షపాతిగా కేంద్రం ముందుకు వెళ్ళిందన్నారు. మోడీ పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు.