తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో హోరాహోరీగా సాగిన పోలింగ్లో స్వతంత్ర అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందారు. ఉల్లెంగుల ఏకానందంను బీఆర్ఎస్ బలపరచగా.. పొన్నాల సంపత్ స్వతంత్ర అభ్యర్థి(బీఆర్ఎస్ రెబల్)గా బరిలో నిలిచారు. ఏకానందం 642ఓట్లు సాధించగా, సంపత్643ఓట్లు సాధించారు. ఒక్క ఓటు ఎక్కువగా రావడంతో ఎన్నికల అధికారులు సంపత్ను విజేతగా ప్రకటించారు.
