జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎం స్పష్టమైన విధానం ప్రకటించాలి : పోతినేని సుదర్శన్​

జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎం స్పష్టమైన విధానం ప్రకటించాలి : పోతినేని సుదర్శన్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా సమగ్రాభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డి స్పష్టమైన విధానం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్​ చేశారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్​​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంతో పాటు పలువురు మంత్రులు జిల్లాలో పర్యటిస్తున్నందున జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. 

జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్​ కాలేజ్​ బిల్డింగ్​ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, సరైన స్పెషలిస్ట్​ డాక్టర్లు, వైద్య సిబ్బంది లేరని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్​ బెడ్​రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కొత్తగూడెంలో పేద ప్రజలకు పొజిషన్​ పట్టాలిచ్చిన పాలకులు, అధికారులు స్థలం మాత్రం చూపించలేదన్నారు. గవర్నమెంట్​ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న ప్రజలకు హక్కు పత్రాలు, పెండింగ్​లో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. తునికాకు సేకరణకు టెండర్లు పూర్తి చేసి ఆకు సేకరణకు శ్రీకారం చుట్టాలన్నారు. సీతారామ ప్రాజెక్ట్​ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, నాయకులు నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, భూక్యా రమేశ్​ఉన్నారు.