హైదరాబాద్: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో సలార్ ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆదివారం ఓ కీలక అప్డేట్ ను ప్రకటించింది మూవీ యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ట్విటర్ ద్వారా తెలిపింది.
ఆదివారం మధ్యాహ్నం 3.25గంటలకు ప్రభాస్ తో ఉన్న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించారు. ఈ సినిమా బొగ్గు గనుల్లో పనిచేసే నాయకుడి పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. కథకి తగ్గట్టే టైటిల్ విషయంలో బ్లాక్ కలర్ పాట్రన్ని ఫాలో అవుతుంది యూనిట్. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ మధు గురుస్వామి విలన్గా నటిస్తున్నాడు.శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ మెకానిక్గా కనిపించనున్నట్టు సమాచారం.
????????? Worldwide #Salaar On ????? ??, ???? ?
We can't wait to celebrate with you all ?#Salaar14Apr22#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @BasrurRavi @bhuvangowda84 pic.twitter.com/tQ3B1jbdt1
— Hombale Films (@hombalefilms) February 28, 2021