- ఫిర్యాదు చేసిన ఇరిగేషన్.. చెక్ చేసిన కమిషనర్లు, కలెక్టర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ను ఆనుకుని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న కట్టడాలను అనుమతులు లేవని, అది హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఇరిగేషన్శాఖ ఫిర్యాదు మేరకు బల్దియా, హైడ్రా కమిషనర్లతో పాటు కలెక్టర్సోమవారం తనిఖీలు చేశారు.
నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ కి అనుకుని రెండెకరాల్లో రెండు టవర్లలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్సంస్థ 153 ఫ్లాట్స్ నిర్మిస్తోంది. పనులు కూడా పూర్తికావొచ్చాయి. ఈ తరుణంలో ఇరిగేషన్శాఖ తమ అనుమతులు తీసుకోలేదని కంప్లైంట్చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్రంగనాథ్, కలెక్టర్ప్రియాంక ఆల సైట్కు వెళ్లారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. పర్మిషన్ లేకుండా కడుతున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని, అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వలేదని, కానీ, 2018లో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయని నిర్మాణదారులు చెప్తున్నారని, వాటిని చెక్చేస్తున్నట్లు చెప్పారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ఎన్ వోసీ లేకుండా నిర్మిస్తున్నట్లు గుర్తించామన్నారు. హుస్సేన్ సాగర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, దాని ప్రకారం ఇది ఎఫ్టీఎల్పరిధిలో ఉందా లేదా అన్నది తేలుతుందని పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం జీహెచ్ఎంసీని ఆశ్రయించగా ఇదంతా బయటకు వచ్చిందని తెలిపారు.
