మునుగోడు ఎన్నికల ఈవీఎంలను మార్చేస్తుండ్రు: కేఏ పాల్

 మునుగోడు ఎన్నికల ఈవీఎంలను మార్చేస్తుండ్రు: కేఏ పాల్

నల్లగొండ జిల్లా:  మునుగోడు ఎన్నికల- ఈవీఎం లను మానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాత్రి ఈవీఎం లతో వచ్చిన ట్రక్.. అనుకోకుండా మాయమైందని ఆరోపించిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం గోల్ మాల్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే తాను 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు పంచినా.. తాను మాత్రం ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అని కేఏ పాల్ పేర్కొన్నారు. 

మునుగోడులో గెలిస్తే సీఎం అవుతా

మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే తాను సీఎం అవుతానని కేఏ పాల్ జోస్యం చెప్పారు. ‘‘ నేను స్వయంగా వంద బూత్ లను పరిశీలించా.. నాకు 1లక్ష 10వేలు పడ్తాయి.. నాపై నమ్మకం ఉంచిన ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసపాత్రుడిగా ఉంటా..’’ అని కేఏ పాల్ అన్నారు.  తాను  ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాలు తిరిగానని గుర్తు చేశారు. 
మీరు ఎలక్షన్ చేయలేరని అమిత్ షా అన్నారు

ఒక సందర్భంలో తనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా  మధ్య  ఘర్షణ జరిగిందని,  మీరు ఎన్నికల్లో పోటీ చేయకండి.. మీరు ఎలక్షన్ చేయలేరని అమిత్ షా అన్నారని కేఏ పాల్ వెల్లడించారు. మునుగోడు పోలింగ్ సందర్భంగా ఛీప్ ఎన్నికల అధికారితో మాట్లాడానని..  ఓ పోలీస్ అధికారి నాతో మిస్ బిహేవ్ చేశాడని ఆరోపించారు. పక్కనే ఉన్న ఎస్పీ ఉన్నా కనీసం పట్టించుకోలేదన్నారు. తన మీద మూడు ఎటాక్ లు జరిగాయని కేఏ పాల్ ఆరోపించారు.  మీకు ప్రాణహానీ ఉందని పలువురు అధికారులు స్వయంగా చెప్పారని..  జిల్లా ఎస్పీ టీఆర్ఎస్ ఏజెంట్ గా పనిచేశారని కేఏ పాల్ విమర్శించారు. 

తెలంగాణకు ఐదు లక్షల కోట్ల అప్పులు చేయడానికి కేసీఆర్ ఏమైనా కేఏ పాలా..?  అంబేద్కరా..? 

అసలు కేసీఆర్ ఎవరు..? తెలంగాణ ద్రోహి, నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తారా..?  ఆయనేమైనా అంబేద్కర్ నా..? కేఏ పాల్ నా..? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఓడిపోతున్నానని కేసీఆర్ కు అర్థమైందన్నారు. దేశంలో బీజేపీ ఈడీ, సీబీఐలను వాడుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం సీబీసీఐడిని వాడుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణను అభివృద్ది చేద్దామంటే.. ఎందుకు ముందుకు రావట్లేదు.. ?  మునుగోడు లో అసలు ఏమైనా అభివృద్ది జరిగిందా..? అని కేఏ పాల్ ప్రశ్నించారు. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ' పేరుతో బుక్ రాశానని కేఏ పాల్ వెల్లడించారు. ‘‘నిన్న ఉపఎన్నిక జరిగితే.. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ ఏంటి..?  కోర్టు చెప్పినా.. ఎందుకు సెక్యూరిటీ, గన్ మేన్లను ఇవ్వట్లేదు.  మీ బహిరంగ సభలో జనాలు ఎక్కడైనా ఉన్నారా..? ఆ టైమ్ లో అంతా నా దగ్గర 40వేల మందికి పైగా ఉన్నారు.. ఈవీఎం టాంపరింగ్ జరక్కపోతే.. మినిమమ్ 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. మునుగోడు ప్రజల సమస్య పరిష్కారం కోసం తిరుగుతా..  కేఏ పాల్ సీఎం, సీఎం అంటూ స్లోగన్ చేస్తుంటే.. ఎస్పీ హడలిపోయారు... ప్రపంచంలోని ఎందరో నియంతలను చూశా.. కేసీఅర్ లాంటి వారిని మాత్రం చూడలేదు.. నేను అందరినీ సమానంగా చూస్తాను.. కేసీఅర్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తే . మోదీ 80 లక్షల కోట్లు అప్పులు చేశారు..’’ అని కేఏ పాల్ విమర్శించారు.  కేసీఆర్ ముక్త్, బీజేపీ ముక్త్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేస్తానని కేఏ పాల్ జోస్యం చెప్పారు.