తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్జావడేకర్ ఈ వివాదంపై స్పందించారు.
ఇండియా కూటమిలో ఉన్న నేతల్లో ఒకరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆ కూటమి అగ్రనాయకుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read : డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత.. నిరసనకారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం
దేశ ప్రజలంతా ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తమ కూటమి నేత అన్న మాటలపై స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఉదయనిధి అన్ని ధర్మాలను అవమానించారని విమర్శించారు. మంత్రిగా ఉన్న ఆయన తన హుందాతనాన్ని కాపాడుకోవాలని సూచించారు.
భారత్ పేరుపై వివరణ
ఈ సందర్భంగా ప్రకాశ్ జవడేకర్ఇండియా పేరును భారత్ గా మార్చడంపై స్పందించారు. భారత్ అనే పేరు గతంలో నుంచే ఉందని, కలకత్తా కోల్కత్తాగా, చెన్నై మద్రాస్గా మారినప్పుడు భారత్ పేరు మారితే తప్పేముందని ప్రశ్నించారు. చిన్నతనం నుంచే భారత్మాతా కీ జై అంటున్నట్లు గుర్తు చేశారు.