డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత.. నిరసనకారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం

డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత.. నిరసనకారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం

డబుల్​ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులందరికీ పంచాలని డిమాండ్​ చేస్తూ మంత్రి మల్లారెడ్డి ఎదుట నిరసనకారులు ఆందోళన చేశారు. మేడ్చల్​ మల్కాజ్​ గిరి జిల్లా శామీర్​పేట మండలం బొమ్మరాసిపేట గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన 380 డబుల్​ బెడ్రూంల పంపిణీకి సెప్టెంబర్​6న మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. 

ఆయన పట్టాలు పంపిణీ చేస్తుండగా నిరసనకారులు ఒక్క సారి సభా ప్రాంగణానికి చొచ్చుకొచ్చారు. పోలీసులు గమనించి వారిని అడ్డుకున్నారు. మంత్రి మాట్లాడుతుండగా అర్హులందరికీ ఒకే సారి ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 

Also Read ; లంచం ఇస్తేనే ఇంక్రిమెంట్లు... ఆదిలాబాద్ రిమ్స్లో స్టాఫ్ నర్సుల నుంచి వసూళ్లు

ప్రస్తుతానికి కొందరికే ఇళ్లు కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ  క్రమంలో మంత్రి మల్లారెడ్డి నిరసనకారలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా వారు మల్లారెడ్డి గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. మంత్రితో గ్రామస్థులు మాట్లాడుతుండగా తుర్కపల్లి సీఐ రాజగోపాల్​రెడ్డి గ్రామస్థులను నెట్టివేశాడని పలువురు ఆరోపించారు. 

నిరసనల్లో పాల్గొన్న  టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్​రెడ్డిపై మంత్రి చిందులు తొక్కారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్​ చేసి పోలీసులు జైలుకు తరలించారు. చివరికి అందరికీ వచ్చే మంగళవారం రోజు పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.