ఇండోనేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు ప్రణయ్

ఇండోనేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు  ప్రణయ్

ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ప్రణయ్ జోరు కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్లో హాంకాంగ్ ప్లేయర్పై గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. 41 నిమిషా పాటు  ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో  ఫస్ట్ గేమ్లో ప్రణయ్ 21-11 స్కోరు తేడాతో లాంగ్ అంగుస్ను మట్టికరిపించాడు. అయితే రెండో గేమ్లో  హాంకాంగ్ ప్లేయర్ పుంజుకున్నాడు. ఈ దశలో  వరుస స్మాష్లతో అంగుస్ను పరిగెత్తించాడు. ఇదే క్రమంలో 21-18 తేడాతో రెండో  గేమ్ను  దక్కించుకుని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు  సింగిల్స్‌లో సమీర్‌ వర్మ ఓటమిపాలయ్యాడు.  10-21, 13-21తో  మలేషియా ప్లేయర్  లీ జీ జియా చేతి పరాజయం చవిచూశాడు. అటు మహిళల డబుల్స్‌లో  అశ్విని- సిక్కి జోడీ, పురుషుల డబుల్స్‌లో అర్జున్‌- ధ్రువ్‌ జంట ఓడిపోయింది.