ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో ప్రణయ్ జోరు కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్లో హాంకాంగ్ ప్లేయర్పై గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. 41 నిమిషా పాటు ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో ఫస్ట్ గేమ్లో ప్రణయ్ 21-11 స్కోరు తేడాతో లాంగ్ అంగుస్ను మట్టికరిపించాడు. అయితే రెండో గేమ్లో హాంకాంగ్ ప్లేయర్ పుంజుకున్నాడు. ఈ దశలో వరుస స్మాష్లతో అంగుస్ను పరిగెత్తించాడు. ఇదే క్రమంలో 21-18 తేడాతో రెండో గేమ్ను దక్కించుకుని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు సింగిల్స్లో సమీర్ వర్మ ఓటమిపాలయ్యాడు. 10-21, 13-21తో మలేషియా ప్లేయర్ లీ జీ జియా చేతి పరాజయం చవిచూశాడు. అటు మహిళల డబుల్స్లో అశ్విని- సిక్కి జోడీ, పురుషుల డబుల్స్లో అర్జున్- ధ్రువ్ జంట ఓడిపోయింది.