
గుర్గామ్: తెలుగు టెన్నిస్ప్లేయర్లు ఎడ్లపల్లి ప్రాంజల–శ్రావ్య శివాని.. ఐటీఎఫ్డబ్ల్యూ–15 విమెన్స్వరల్డ్ ర్యాంకింగ్టోర్నీలో డబుల్స్టైటిల్ను గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల–శ్రావ్య 6–4, 6–0తో మహికా ఖన్నా–సోహిని మొహంతిపై గెలిచారు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ప్రాంజల జోడీ బలమైన షాట్స్తో ఆకట్టుకుంది. కీలక టైమ్లో ప్రత్యర్థుల సర్వీస్ను బ్రేక్ చేసి ఆధిక్యాన్ని కాపాడుకున్నారు.
విమెన్స్సింగిల్స్లో జీల్దేశాయ్ 2–6, 6–1, 6–4తో శ్రుతి అహ్లావత్పై నెగ్గి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో రెండో ఫైనల్ ఆడిన జీల్కు ఇది తొలి టైటిల్ కావడం విశేషం. ఏప్రిల్లో ట్యూనీసియాలో జరిగిన మొనాస్టిర్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. బిల్లీ జీన్ కింగ్ కప్ కెప్టెన్ విశాల్ ఉప్పల్ ఆధ్వర్యంలో ‘ద టెన్నిస్ ప్రాజెక్ట్’ పేరుతో ఈ టోర్నీని నిర్వహించారు.