
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషిగా బయటికొచ్చిన ప్రసాద్ శ్రీకాంత్పురోహిత్ తిరిగి కల్నల్ గా పదోన్నతి పొందారు. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లు కేసులో ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ పై అభియోగాలు ప్రాసిక్యూషన్ నిరూపించలేపోవడంతో ముంబైకోర్టు ఆయనను, మరో ఆరుగురు నిందితులను నిర్ధోషులుగా తీర్పు నిచ్చింది. ప్రసాద్పురోహిత్ నిర్దోషిగా విడుదలైన తర్వాత తాజాగా ఆయనను కల్నల్ హోదా పదోన్నతి కల్పించారు.
2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు..
సెప్టెంబర్ 29,2008లో ముంబైకి సమీపంలోని మాలేగావ్లో ఓ మసీదులో మోటార్బైక్ కు అమర్చిన బాంబు పేలి ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. 101మంది గాయపడ్డారు.ఈ పేలుళ్లకు సంబంధించిన 14మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ కూడా ఉన్నారు.
Congratulations Col. Purohit on being back in uniform.
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) September 25, 2025
The Govt stands firmly with patriots who serve the nation with courage and integrity. pic.twitter.com/C8rd2WMkbe
ఈ కేసులో పురోహిత్ కు 8ఏళ్ల జైలు శిక్ష పడింది. 17ఏళ్ల కిందటి కేసులో 14మందిలో ఏడుగురిని విచారించిన ముంబై కోర్టు.. 2025 జూలై 14న వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. విడుదల అయిన నిందితుల్లో రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్,సుదాంకర్ ధర ద్వివేది, సమీర్ కులకర్ణి ఉన్నారు.
►ALSO READ | ఇండియా మహా అద్భుతం చేసింది : రైలు బోగీ లాంటి లాంఛర్ నుంచి అగ్ని క్షిపణి ప్రయోగం సక్సెస్
పురోహిత్ పదోన్నతిపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అభినందనలు తెలిపారు. పురోహిత్ గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. ధైర్యంగా దేశానికి సేవ చేసే దేశభక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అని గిరిరాజ్ సింగ్ X లో పోస్ట్ చేశారు.