
హైదరాబాద్, వెలుగు: ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ జనరల్ కన్సల్టెంట్(జీసీ) కోసం మంగళవారం ప్రీ క్వాలిఫికేషన్ మీటింగ్ జరిగింది. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 23 నేషనల్, ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలు పాల్గొన్నాయి. మెట్రో మొదటి దశ ప్రత్యేకతలను, ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. టెక్నికల్గా, ప్రాజెక్ట్ నిర్వహణ విధుల్లో హెచ్ఏఎంఎల్కు జనరల్ కన్సల్టెంట్ సాయం అందిస్తుందని తెలిపారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రివ్యూ, టెండర్ డాక్యుమెంటేషన్ అండ్ వాల్యూయేషన్, డిజైన్ మేనేజ్మెంట్, వివిధ కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్లు తదితర అంశాల్లో సహాయపడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 13లోగా జనరల్ కన్సల్టెంట్ కోసం బిడ్లను సమర్పించాలన్నారు.
శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి
గండిపేట: ఈ నెల 9న ఉదయం 10 గంటలకు మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శంకు స్థాపన అనంతరం రాజేంద్రనగర్ పోలీస్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మెట్రోఎండీ ఎన్వీఎస్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మంగళవారం మరోసారి పరిశీలించారు.