యూపీఎస్సీ చైర్​పర్సన్​గా ప్రీతి సుదాన్

యూపీఎస్సీ చైర్​పర్సన్​గా ప్రీతి సుదాన్
  • 37 ఏండ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం 
  • ఇటీవల రాజీనామా చేసిన మనోజ్ సోని స్థానంలో నియామకం
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు పదవిలో కొనసాగనున్న సుదాన్​

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్​పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ 29 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. ఆగస్టు 1వ తేదీన చైర్​పర్సన్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రీతి సుదాన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె​ భర్త కూడా ఐఏఎస్  ఆఫీసరే. వీరిద్దరు ఏపీ కేడర్ ఐఏఎస్‌లు. ఉమ్మడి ఏపీలోని వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా పని చేశారు. 

ప్రీతి సుదాన్ 37 ఏండ్ల పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర​ హెల్త్​ సెక్రటరీగా కరోనా టైమ్  లో యాక్టివ్ రోల్ పోషించారు. బేటీ బచావో, ఆయుష్మాన్ భారత్ స్కీంల రూపకల్పనలో, ఈ - సిగరెట్లపై నిషేధం, జాతీయ వైద్య కమిషన్‌పై చట్టం వంటి అంశాల్లోనూ కీలకంగా పని చేశారు. కాగా, ఇటీవలి వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రిజైన్​ చేయడంతో కొత్త చైర్మన్ నియామకం అనివార్యం అయింది.