వైద్యం వికటించి గర్భిణి మృతి.. మంచాల పీహెచ్సీ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

వైద్యం వికటించి గర్భిణి మృతి.. మంచాల పీహెచ్సీ ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

ఇబ్రహీంపట్నం, వెలుగు: వైద్యం వికటించి ఏడు నెలల గర్భిణి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లికి చెందిన 7 నెలల గర్భిణి పంతంగి మానస (22) రెగ్యులర్​గా సుల్తాన్​బజార్ మెటర్నిటీ హాస్పిటల్​కు చెకప్​కు వెళ్తోంది. ఐరన్ తక్కువగా ఉందని ఇంజెక్షన్ తీసుకోవాలని ప్రిస్క్రిప్షన్​లో అక్కడి డాక్టర్ సూచించడంతో.. శుక్రవారం మంచాల పీహెచ్​సీకి వెళ్లింది. అక్కడ ఇంజెక్షన్​ తీసుకున్న 10 నిమిషాల్లోనే మానస కుప్పకూలింది. 

దీంతో బాధితురాలిని కుటుంబసభ్యులు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మానస మృతికి కారణమని మంచాల పీహెచ్​సీ ముందు బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. భర్త పంతంగి ఆనంద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.