కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి

కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి
  • ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి 

యాదాద్రి, వెలుగు : వలిగొండలో నాలుగు లైన్ల కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం భువనగిరి –-చిట్యాల మార్గంలో వలిగొండ  బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే ఆర్​అండ్​బీ అధికారులను అక్కడికి పిలిపించారు.  బ్రిడ్జిపై ఉన్న గుంతలను వారికి చూపించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగినందున ప్రస్తుతం ఉన్న ఈ బ్రిడ్జి సరిపోదన్నారు. భవిష్యత్​లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం కోసం  ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. అనంతరం బీబీనగర్​మండలంలోని రుద్రవెల్లి లోలెవల్​అండర్​ బ్రిడ్జిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.