పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించారు. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు రమేశ్ బైస్ ఝార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా కొత్త గవర్నర్ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఏపీ గవర్నర్గా నియమించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు.
మొత్తం12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
* అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్
* సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
* ఝార్ఖండ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్
* అసోం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా
* హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివ్ ప్రతాప్
* ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు.
* ఛత్తీస్గఢ్ గవర్నర్ సుశ్రీ అనుసూయా ఉక్యే మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు.
* మణిపూర్ గవర్నర్ గణేశన్ నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు.
* హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు.
* అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్ జీ)గా నియమితులయ్యారు.
