28న హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

28న హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. దేశ 15వ రాష్ట్రపతి హోదాలో మొదటిసారి శీతాకాల విడిదికి ముర్ము రాష్ట్రానికి రానున్నారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్ 28వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటారు. 29న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అథితులతో భేటీ అవుతారు. తర్వాత డిసెంబర్ 30న సాయంత్రం ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు.