రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లైవ్ అప్ డేట్స్

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లైవ్ అప్ డేట్స్

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదింటివరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభం కాగానే... పార్లమెంట్ హాల్ లో ప్రధాని మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, హేమమాలిని ఓటేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కుమారుడు... బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ హాల్ కు వీల్ ఛైర్ లో వచ్చి ఓటేశారు. ఎన్నికల రిటర్నింగ్  అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితారు ప్రకటిస్తారు. ఈనెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణస్వీకారం చేస్తారు. NDA తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్  సిన్హా బరిలో ఉన్నారు. 

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

సోనియా గాంధీ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు

హర్భజన్ సింగ్, ఆప్ ఎంపీ

 గౌతమ్ గంభీర్, బీజేపీ ఎంపీ

జయా బచ్చన్, సమాజ్వాదీ ఎంపీ

మనోహర్ ఖట్టర్, హర్యానా సీఎం

ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ చీఫ్

రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి

శరద్ పవార్, ఎన్సీపీ అధినేత

తెలంగాణ సీఎం కేసీఆర్

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

తెలంగాణ మంత్రి కేటీఆర్

కేరళ సీఎం పినరయి విజయన్ 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే 

గోవా సీఎం ప్రమోద్ సావంత్

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

బీజేపీ ఎంపీ హేమామాలిని

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్

 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 

ఏపీ సీఎం జగన్ 

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ 

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్

తమిళనాడు సీఎం స్టాలిన్

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

ప్రధాని మోడీ