
హైదరాబాద్, వెలుగు: డ్రై క్లీనింగ్, లాండ్రీ సేవలు, యాక్సెసరీస్ అందించే స్పెయిన్ కంపెనీ ప్రెస్టో ఇండియా హైదరాబాద్లో అడుగుపెట్టింది. బంజారా హిల్స్ హైటెక్ సిటీలలో కొత్తగా రెండు స్టోర్లను ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలంగా అత్యుత్తమ సేవలను అందించడమే తమ లక్ష్యమని ప్రకటించింది.
డ్రై క్లీనింగ్, లాండ్రీ, అల్టరేషన్ , షూ బ్యాగ్ రిపేర్ వంటి సేవలు అందిస్తుంది. ప్రెస్టో ఇండియా ఎండీ య్వో మెట్జెలార్ మాట్లాడుతూ... ప్రపంచ ప్రఖ్యాత ప్రెస్టో అనుభవాన్ని హైదరాబాద్ ప్రజలకు అందించడం ఆనందంగా ఉంది అన్నారు.
దేశంలో ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు ప్రాంతాల్లో 50కి పైగా స్టోర్లను ప్రెస్టో నడుపుతోందని వివరించారు.