ఘనంగా ‘ ప్రైడ్ ఆఫ్​ తెలంగాణ అవార్డ్స్’

ఘనంగా ‘ ప్రైడ్ ఆఫ్​ తెలంగాణ అవార్డ్స్’
  • 12 విభాగాల్లో  అచీవర్​అండ్​ఎమర్జింగ్​టాలెంట్​అవార్డుల అందజేత

మాదాపూర్​, వెలుగు : రౌండ్ టేబుల్​ఇండియా ఆధ్వర్యంలో  ప్రైడ్​ఆఫ్​తెలంగాణ అవార్డ్స్​5వ ఎడిషన్​ ఆదివారం ఘనంగా ముగిసింది. మాదాపూర్​లోని హెచ్​ఐసీసీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి  సినీ డైరెక్టర్లు భాస్కర్,​ అనీష్​ కురువిల్లా, జి. నారాయణమ్మ ఇంజనీరింగ్​కాలేజీ వైస్​ చైర్మన్​విద్యారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సమాజ అభివృద్ధి, ఎదుగుదల వంటి అంశాలతో కూడిన​12 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అచీవర్​అండ్​ఎమర్జింగ్​టాలెంట్​అవార్డులను జ్యూరీ సభ్యులు అందజేశారు.

కళలు, సంస్కృతి, విద్య, వినోదం, ఆరోగ్య సంరక్షణ, ఎన్ జీఓ, రిటైల్​, క్రీడలు, స్టార్టప్, ఇన్ఫ్రా, స్టార్​ కిడ్స్​, స్టార్​ మహిళా వంటి అంశాలు ఉన్నాయి. రౌండ్​ టేబుల్ ఇండియా ప్రెసిడెంట్​ఆదర్శ్​ కుమార్​ మాట్లాడుతూ.. పాఠశాలల నిర్మాణం, పేద విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడమే తమ ముఖ్య ఉద్ధేశమని  పేర్కొన్నారు.  తెలంగాణకు పేరు, కీర్తి తెచ్చిన వారిని గుర్తించి అవార్డులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రైడ్​ఆఫ్​ తెలంగాణ అవార్డ్స్​కన్వీనర్​మణిందర్​సింగ్​మల్హోత్రా, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.