
బ్రెసీలియా: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జులై 09) బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా చేరుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సు ముగిసిన తర్వాత మోదీ బ్రెసీలియాలో అడుగుపెట్టారు.
అక్కడ ఆయనకు భారతీయ, బ్రెజిలియన్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది. శివ తాండవ స్తోత్రంతో పాటు బ్రెజిలియన్ సాంబా రెగె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను చూసిన ప్రధాని.. కళాకారులను అభినందించారు.
తనకు లభించిన ఘన స్వాగతంపై మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "కొద్దిసేపటి క్రితం బ్రెసీలియాలో ల్యాండ్ అయ్యాను. ప్రవాస భారతీయులు చేసిన ఘన స్వాగతం మరపురానిది. ఈ స్వాగతం భారత్, -బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.