అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ

అధికారంలో వరుసగా 20 ఏండ్లున్న నేతగా పీఎం రికార్డు 

2001లో గుజరాత్‌‌‌‌ సీఎంగా.. 2014 నుంచి ప్రధానిగా..

ఓటమి లేని లీడరంటూ బీజేపీ నేతల అభినందనలు

ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  వలంటీర్‌‌‌‌ నుంచి..

గత నెలలో 70వ పుట్టినరోజు జరుపుకు న్న నరేంద్ర మోడీ ఫస్ట్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ కర సేవకుడిగా పనిచేశారు. తర్వాత బీజేపీ ఆర్గనైజేషన్​లో చేరారు. 2001లో గుజరాత్‌‌‌‌ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ఓటమనేది లేకుండా గెలుస్తున్నారు. 2014లో లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీని సెంట్రల్​లో అధికారంలోకి తీసుకొచ్చారు. 2019లో ఇంకిన్ని ఎక్కువ సీట్లు గెలిచారు. 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా 20 ఏండ్ల పాటు పవర్‌‌‌‌లో ఉన్న నేతగా ఘనత సాధించారు. గుజరాత్‌‌‌‌ సీఎంగా 2001లో అక్టోబర్‌‌‌‌ 7న బాధ్యతలు చేపట్టిన మోడీ 13 ఏండ్లు కొనసాగారు. తర్వాత 2014లో లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక పీఎం పదవి చేపట్టారు. ఏడేండ్లుగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. పవర్‌‌‌‌లో ఉన్న నేతగా బుధవారం 20వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మోడీ ఓటమి లేని నాయకుడంటూ బీజేపీ నేతలు, ప్రముఖులు పొగుడుతున్నారు. #20thYearOfNamo హ్యాష్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌తో సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టులు, ట్వీట్లు పెడుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న వ్యక్తుల్లో మోడీ ఒకరంటూ కేంద్ర మంత్రి రవి శంకర్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఫ్రాంక్లిన్ రూజ్‌‌‌‌వెల్ట్, దివంగత బ్రిటన్‌‌‌‌ ప్రధాన మంత్రి మార్గరేట్ థాచర్‌‌‌‌లతో మోడీని పోల్చారు. ఇండియన్లకు ఇది గర్వకారణమని అన్నారు. మరింత కాలం అధికారంలో కొనసాగే పవర్‌‌‌‌ మోడీకి రావాలని కోరుకున్నారు. ప్రభుత్వ అధినేతగా ఓటమెరుగని నేతంటూ మోడీని బీజేపీ ప్రెసిడెంట్‌‌‌‌ జేపీ నడ్డా పొగిడారు. ‘అగ్రికల్చర్‌‌‌‌లో సంస్కరణలు, ఇండస్ట్రియల్‌‌‌‌ గ్రోత్‌‌‌‌, బాలిక విద్యను ప్రోత్సహించి గుజరాత్‌‌‌‌ను మోడీ మార్చేశారు. ఇప్పుడు పీఎంగా ఇండియాను న్యూ ఇండియాగా మార్చుతున్నారు’ అని కేంద్ర ఫైనాన్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ నిర్మలా సీతారామన్‌‌‌‌ ప్రశంసించారు. ‘దేశం కోసం ప్రధాని మోడీ నిరంతరం పని చేస్తున్నారు. ప్రతిపక్షాలు అతన్ని ఆపలేవు. దేశప్రజలకు మోడీపై నమ్మకం ఉంది. అతని సంకల్పం ఎప్పటిలానే బలంగా ఉంటుంది’ అని ఉత్తరప్రదేశ్‌‌‌‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు.