మోడీ సిక్కు క్యాడెట్ తలపాగా

మోడీ సిక్కు క్యాడెట్ తలపాగా

సిక్కు క్యాడెట్ తలపాగా పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్​గా కన్పించారు. ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌‌లో శుక్రవారం  నేషనల్ క్యాడెట్ కోర్​ (ఎన్‌‌సీసీ) ర్యాలీ జరిగింది. దీనికి ప్రధాని హాజరై మార్చ్​ఫాస్ట్‌‌ను సమీక్షించారు. ఉత్తమ క్యాడెట్లకు పతకాలు, లాఠీలు అందజేశారు. తర్వాత మాట్లాడుతూ.. తాను కూడా ఎన్​సీసీలో యాక్టివ్​గా పాల్గొన్నానని, దేశానికి సేవ చేయడంలో ఆనందం ఉంటుందని అన్నారు. స్టూడెంట్​ దశ నుంచే దేశ సేవలో పాల్గొనడం అదృష్టమని చెప్పారు. ఎన్​సీసీ బలోపేతానికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందన్నారు.