పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని విరాళం

పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని విరాళం

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళా కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ 21 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రధాని ఇటీవల కుంభమేళాలో వారి సేవలకు గాను పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. మోడీ ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నిజమైన కర్మ యోగులని ప్రశంసించారు.

ప్రధాని ఇటీవల తీసుకున్న సామాజిక వితరణ చర్యల్లో భాగంగా కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులకు రూ 21 లక్షల విరాళం అందచేశారని ప్రధాని కార్యాలయం (PMO) బుధవారం ట్వీట్‌ చేసింది. ప్రధాని సామాజిక సేవా కార్యక్రమాల్లో చూపిన చొరవ, ప్రకటించిన సాయాలకు సంబంధించిన అనేక సందర్భాలను PMO ఈ ట్వీట్‌లో ప్రస్తావించింది.