
కొడంగల్, వెలుగు: దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు.. ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్వారిని పాఠశాలలోకిఅనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు వద్దే గంటల తరబడి నిరీక్షించారు. ఈ ఘటన మంగళవారం దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల వద్ద చోటుచేసుకుంది.
ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్అప్డెట్చేసుకొని రావాలని సూచించడంతోనే ఆలస్యమైందని పిల్లలు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఆర్సీవో ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఆయనతో వాగ్వాదానికి దిగడం, విలేకరులు అక్కడికి చేరుకోవడంతో విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించారు.