సెల్​ టవర్ ఎక్కిన ప్రైవేట్ ​కాంట్రాక్టర్.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్​

సెల్​ టవర్ ఎక్కిన ప్రైవేట్ ​కాంట్రాక్టర్.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్​

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలోని హైదర్​నగర్​లో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ సెల్ టవర్​ఎక్కి హల్​చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదర్​నగర్​లోని ఆర్అండ్ఎల్ ఇంజినీరింగ్​కంపెనీలో రాము(35)  సివిల్ కాంట్రాక్ట్​పనులు చేస్తున్నాడు. పెండింగ్​బిల్లులు రూ.8 లక్షలను కంపెనీ అతనికి చెల్లించడం లేదు.

ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోకపోవటంతో బుధవారం మధ్యాహ్నం రాము బాటిల్​లో పెట్రోల్​పోసుకొని, సెల్ టవర్ ఎక్కాడు. తన డబ్బులు ఇవ్వకపోతే కాల్చుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్​సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, అతనికి నచ్చజెప్పారు. కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి, బిల్లులు చెల్లించేందుకు అంగీకరించడంతో రాము కిందికి వచ్చాడు.