- కరోనాకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
- తీవ్రతను బట్టి 5 నుంచి 17 రోజుల వరకు ట్రీట్మెంట్
- రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్
- మాస్కులు, శానిటైజర్లు, థర్మామీటర్లు, ఆక్సిమీటర్లతో కరోనా కిట్ కూడా
- మంచి డైట్తోనే కరోనా తొందరగా నయమవుతదంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజూ వందలకొద్దీ కరోనా కేసులు వస్తున్నాయి. అన్ని కేసులకూ ఒక్కటే కేరాఫ్ గాంధీ. కానీ, కేసులు పెరిగే కొద్దీ అక్కడా బెడ్స్ సరిపోయే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా లిమిటెడే. అందుకే రాష్ట్ర సర్కార్ పాజిటివ్ వచ్చిన వాళ్లనూ హోమ్ఐసోలేషన్లోనే ఉంచుతోంది. ఇంటికి పంపుతోంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు ఇంటివద్దే ట్రీట్మెంట్ చేసే ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసెస్ను ప్రకటిస్తున్నాయి. హోం ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ల కోసం స్పెషల్ కొవిడ్19 వర్చువల్ హోమ్కేర్ ఫెసిలిటీస్ను కొన్ని ప్రైవేట్ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
బేసిక్.. అడ్వాన్స్డ్ ప్యాకేజీలు
హైదరాబాద్లోని యశోద, కిమ్స్, కాంటినెంటల్, మెడికవర్, సెంచరీ, కేర్, కాంటినెంటల్ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఈ స్పెషల్ హోం ట్రీట్మెంట్ను చేస్తున్నాయి. తీవ్రతను బట్టి బేసిక్, అడ్వాన్స్డ్ ప్యాకేజీలను ఇస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 5 రోజుల నుంచి 17 రోజుల వరకు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. అందుకు రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. ట్రీట్మెంట్తో పాటు కరోనా కిట్ను కూడా హాస్పిటళ్లు ఇస్తున్నాయి. ట్రీట్మెంట్ చార్జీలకు ఇవి అదనం. ఈ కిట్లో పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్థర్మామీటర్, ఎన్95 మాస్కులు, శానిటైజర్, ఇన్సెంటివ్ స్పైరోమీటర్, వేస్ట్ డిస్పోజబుల్ బ్యాగ్స్, గ్లోవ్స్ ఉంటాయి. 24 గంటల ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ను అందిస్తున్నాయి. ప్యాకేజీల్లో భాగంగా రోజూ వీడియో కాల్ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు పేషెంట్లను మానిటర్ చేస్తుంటారు. అపోలో హాస్పిటల్స్.. ప్రాజెక్ట్ కవచ్ పేరుతో టెలీ కన్సల్టేషన్ యాప్ను లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది టెలీ కన్సల్టేషన్ సేవలు వాడుకునే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. తక్కువ లక్షణాలున్న వాళ్లనూ హోమ్ఐసోలేషన్ అవ్వాలని ఇటు డాక్టర్లూ చెబుతున్నారు. ఇటు జనాలు కరోనా సీరియస్గా ఉన్న పేషెంట్లతో ఉంటే తమకూ అంటుకుంటున్న భయంతో హోమ్ఐసోలేషన్వైపే మొగ్గు చూపుతున్నారు.
హాస్పిటల్ రోజులు బేసిక్ ప్యాకేజీ అడ్వాన్స్డ్ ప్యాకేజీ
కాంటినెంటల్ 7 రోజులు రూ.3,499 రూ.3,999
15 రోజులు రూ.6,499 రూ.7,999
యశోద 15 రోజులు రూ.19,500
మెడికవర్ 5 రోజులు రూ.5,000 రూ.6,500
సెంచరీ 14 రోజులు రూ.14,500
కిమ్స్ 14 రోజులు రూ.12,999
కేర్ 17 రోజులు రూ.7,999
డైట్తోనే తొందరగా నయమైతది
మంచి ఫుడ్తోనే కరోనా తొందరగా నయమైతది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన కరోనా పేషెంట్లకు సరైన డైట్ మెనూను ప్రత్యేకంగా ప్రిపేర్ చేశాం. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారితో వీడియో కాల్స్తో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాం.ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వాట్సాప్, మెయిల్, వీడియో కాల్ ద్వారా పేషెంట్లకు తెలియజేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వాళ్లు 17 రోజుల తర్వాత కూడా ఆ డైట్నే రెండు, మూడు నెలల పాటు తీసుకుంటే చాలా వరకు మంచిది. ఇమ్యూనిటీ పెరిగేలా ఇమ్యునో న్యూట్రియంట్స్ బాగా తీసుకోవాలి. విటమిన్ సి, జింక్ ఉండేలా చూసుకోవాలి.విటమిన్ సీ ని రోజూ 500 ఎంజీ నుంచి 1,000 ఎంజీ వరకు తీసుకోవాలి. విటమిన్ డీ కూడా ఎక్కువగా వాడాలి. ప్రోటీన్ ఫుడ్నూ తినాలి. పాలు, మాంసం, పుట్టగొడుగులు, గుడ్డులోని తెల్లసొన, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి.
– డాక్టర్ సుష్మ,
డైటీషియన్, కేర్ హాస్పిటల్స్