ఓయూ, వెలుగు: ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన స్టూడెంట్లకు ప్రైవేట్రీసెర్చ్ సెంటర్లలో గైడ్లను అలాట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. క్యాంపస్లో అలాట్మెంట్ కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. రీసెర్చ్ సెంటర్లలో ఎటువంటి అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లకు సూపర్ వైజర్ చాన్స్ఇవ్వడం ద్వారా మా భవిష్యత్అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రూ.2 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన పీహెచ్డీ కోర్సు ఫీజును తగ్గించాలని, అడ్మిషన్పొందిన ప్రతి స్టూడెంట్కు హాస్టల్, మెస్సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టూడెంట్లు నెల్లి సత్య, ఆజాద్, అఖిల్, కిరణ్, మహేశ్, శ్రీవాత్సవ, గోవర్ధన్తదితరులు పాల్గొన్నారు.