విధులు బహిష్కరించిన ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు

విధులు బహిష్కరించిన ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు

పరిగి, వెలుగు: తమను పరిగి ఆర్టీసీ డిపో మేనేజర్​ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రైవేట్​ఆర్టీసీ డ్రైవర్లు నిరసనకు దిగారు. బుధవారం ఉదయం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీటింగ్​కెపాసిటీకి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవాలని డిపో మేనేజర్​ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. 

ఈ విషయంపై డిపో మేనేజర్​ సుఖేందర్​రెడ్డి స్పందిస్తూ.. ఓ డ్రైవర్​బస్సు ఆపకుండా వెళ్లాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదుతో సదరు డ్రైవర్​కు ఒకరోజు విధులు ఇవ్వలేదని చెప్పారు. అంతేగానీ తాను డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నామనడంలో వాస్తవం లేదన్నారు. ప్రైవేట్​డ్రైవర్ల విధుల బహిష్కరణతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.