హైదారాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మొయినాబాద్ మృగవాణి పార్క్ దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాపడింది. బస్సులోని పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
బండ్లగూడ జాగీర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తుండగా మృగవాణి పార్కు దగ్గరకు చేరుకోగానే ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు బోల్తాపడింది
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,స్థానికులు గాయపడ్డ విద్యార్థులను అంబులెన్స్ లో వెంటనే షాదన్ ఆస్పత్రికి తరలించారు . ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బోల్తా పడ్డ వాహనాన్ని జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు పోలీసులు. బస్సు ప్రమాద ఘటనతో ఆస్పత్రికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా లేదా..బస్సు ఫిట్నెస్ పై అని ఆరాదీస్తున్నారు.
