ప్రైవేట్ స్కూల్ లోస్డూడెంట్స్ డేటా చోరీ.. 167 మంది యూ డైస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ .. కామారెడ్డి జిల్లాలో ఘటన

ప్రైవేట్ స్కూల్ లోస్డూడెంట్స్ డేటా చోరీ.. 167 మంది యూ డైస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ .. కామారెడ్డి జిల్లాలో ఘటన
  • కామారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్​ నుంచి మహారాష్ట్రలోని మరో స్కూల్​కు డేటా
  • కేసు నమోదు చేసిన పోలీసులు, ఆపరేటర్​ అరెస్ట్

కామారెడ్డి/పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్​ ప్రైవేట్​ స్కూల్​కు చెందిన 167 మంది స్టూడెంట్స్​ డేటా చోరీకి గురైంది. పెన్(పర్మినెంట్​ ఎడ్యుకేషన్​ నంబర్) కోసం యూ- డైస్​లో(యూనిఫైడ్​ డిస్ట్రిక్ట్​​ఇన్ఫర్మేషన్​ సిస్టం​ఫర్​ ఎడ్యుకేషన్) ఎంట్రీ చేసిన 167 మంది విద్యార్థుల డేటా ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని మరో స్కూల్​కు ట్రాన్స్​ఫర్​ అయింది. సదరు స్కూల్​కు చెందిన స్టూడెంట్స్​ డేటాను ప్రిన్సిపాల్​  పరిశీలించగా, 167 మంది స్టూడెంట్స్​ డేటా ఆన్​లైన్​లో కనిపించలేదు. ఇక్కడి నుంచి డేటా మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా దెగ్లూర్​లో ఉన్న జిజామాత స్కూల్​కు ట్రాన్స్​ఫర్​ అయినట్లు గుర్తించారు.

దెగ్లూర్​లో ఉన్న ఆ స్కూల్​లో ఎక్కువ మంది స్టూడెంట్స్​ను చూపెట్టి  అక్కడి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు డేటా ట్రాన్స్​ఫర్​ చేసినట్లు గుర్తించారు. కామారెడ్డి  జిల్లాలోని ప్రైవేట్  స్కూల్​ యజమానులు ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, శనివారం పిట్లం ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు డేటా ట్రాన్స్​ఫర్​లో  కీలక పాత్ర పోషించిన బ్లూ బెల్స్​ స్కూల్​ ఆపరేటర్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు. 

కంప్యూటర్​ ఆపరేటర్​ కీలకపాత్ర..

పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్​ స్కూల్​ ఉంది.  ఇందులో కొన్నేళ్లుగా  అల్కేశ్​ అనే వ్యక్తి కంప్యూటర్​ ఆపరేటర్​గా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఆదేశాలతో స్కూల్​ విద్యార్థుల పూర్తి వివరాలను యూ డైస్​లో ఎంట్రీ చేశారు. కొద్ది నెలల కింద స్కూల్​ ప్రిన్సిపాల్​ స్టూడెంట్స్​ డేటా పరిశీలించగా, 1,386 మంది స్టూడెంట్స్​కు గాను, 1,219 మంది డేటా మాత్రమే కనిపించింది.

167 మంది స్టూడెంట్స్​ సమాచారం ఆన్​లైన్​లో లేదని గుర్తించి ఆరా తీయగా, మహారాష్ట్రలోని స్కూల్​కు ట్రాన్స్​ఫర్​ అయినట్లు గుర్తించారు. కంప్యూటర్​ అపరేటర్​ మహారాష్ట్రలోని స్కూల్​ యాజమాన్యంతో రూ.4 లక్షలతో ఒప్పందం చేసుకొని, రూ.2 లక్షల అమౌంట్​ తీసుకొని డేటాను ట్రాన్స్​ఫర్​ చేసినట్లు తేలింది. కంప్యూటర్​ ఆపరేటర్​ అల్కేశ్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపామని ఎస్సై వెంకట్రావు తెలిపారు.