నా పెళ్లి లవ్​ జిహాద్​ కాదు

నా పెళ్లి లవ్​ జిహాద్​ కాదు

సౌత్​ నటి.. నేషనల్​ అవార్డు విన్నర్​ ప్రియమణి సోషల్​ మీడియాలో తాను ఎదుర్కొన్న వేధింపులపై మాట్లాడారు. 2017లో బిజినెస్​ మ్యాన్​ ముస్తాఫా రాజ్​ను ఆమె పెళ్లాడిని విషయం తెలిసిందే. పెళ్లైన కొత్తలో ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తనను ట్రోల్​ చేశారని ఆమె తెలిపింది. తన పెళ్లిని లవ్​ జిహాద్ అన్నారని.. పిల్లలు కూడా అలాగే తయారవుతారంటూ దారుణంగా నిందించారని చెప్పింది.

ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఇదే కాకుండా కరోనా టైంలో బరువు తగ్గితే దానిపై కూడా ట్రోల్​ చేశారని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా తన భర్తతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలాంటి కామెంట్లు చేసేవారు కొంచెం వివేకంతో ఆలోచించాలని ప్రియమణి కోరింది.