
సౌత్ నటి.. నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న వేధింపులపై మాట్లాడారు. 2017లో బిజినెస్ మ్యాన్ ముస్తాఫా రాజ్ను ఆమె పెళ్లాడిని విషయం తెలిసిందే. పెళ్లైన కొత్తలో ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తనను ట్రోల్ చేశారని ఆమె తెలిపింది. తన పెళ్లిని లవ్ జిహాద్ అన్నారని.. పిల్లలు కూడా అలాగే తయారవుతారంటూ దారుణంగా నిందించారని చెప్పింది.
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఇదే కాకుండా కరోనా టైంలో బరువు తగ్గితే దానిపై కూడా ట్రోల్ చేశారని ప్రియమణి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా తన భర్తతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలాంటి కామెంట్లు చేసేవారు కొంచెం వివేకంతో ఆలోచించాలని ప్రియమణి కోరింది.