ప్రొ పంజా లీగ్‌‌ లో హైదరాబాద్‌‌ బోణీ

 ప్రొ పంజా లీగ్‌‌ లో హైదరాబాద్‌‌ బోణీ

న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్‌‌ (ఆర్మ్‌‌ రెజ్లింగ్‌‌) తొలి సీజన్‌‌లో  కిరాక్‌‌ హైదరాబాద్‌‌ జట్టు బోణీ చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌ దశ రెండో మ్యాచ్‌‌లో హైదరాబాద్‌‌ 12--–5తో బరోడా బాద్‌‌షాస్‌‌పై  ఘన విజయం సాధించింది.   మెయిన్‌‌ కార్డ్‌‌లో మెన్స్‌‌ 80 కేజీల కేటగిరీలో ధీరజ్‌‌ సింగ్‌‌ 5-–0తో అఫ్సల్‌‌ టీపీపై, 60 కేజీల్లో  నవీన్‌‌ 5-–0తో మోనుపై మెరుపు విజయం సాధించారు. 100 కేజీ మ్యాచ్‌‌లో అహ్మద్‌‌ ఫైజా 1--–3తో సమీర్‌‌ ఖాన్‌‌ చేతిలో ఓడాడు. అండర్‌‌ కార్డ్‌‌ ఈవెంట్‌‌లో  బంబాట్జుబా, కీర్తిక ఓడినా ఉజ్వల్‌‌  కీలక విజయం సాధించాడు. హైదరాబాద్‌‌ ఆర్మ్‌‌ రెజ్లర్లను ప్రాంచైజీ సీఈవో త్రినాథ్‌‌ రెడ్డి అభినందించారు.