
న్యూఢిల్లీ: ప్రొ పంజా ఆర్మ్ రెజ్లింగ్ లీగ్ మొదటి సీజన్లో కిరాక్ హైదరాబాద్ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ 28-–30 తేడాతో కొచి కెడిస్ చేతిలో పోరాడి ఓడింది. అండర్ కార్డ్ సెక్షన్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు నెగ్గి 2-–2తో సమంగా నిలిచాయి. మెయిన్ కార్డులో స్టీవ్ థామస్ (70 కేజీ), కెప్టెన్ అస్కర్ అలీ ( 80 కేజీ), సిద్దార్థ్ (90 కేజీ) విజయాలు సాధించగా, మధుర (65 కేజీ), జిన్సీ జోస్ (+65 కేజీ), ఉజ్వల్ (+100కేజీ) ఓడిపోవడంతో స్కోరు 27–27తో సమం అయింది. టై బ్రేకర్లో స్టీవ్ 1–0తో రుద్ర నాయక్పై గెలిచినా, చివరి మూడు మ్యాచ్ల్లో అస్కర్ అలీ, మధుర, జిన్సీ జోస్ ఓడిపోవడంతో హైదరాబాద్ రన్నరప్తో సరిపెట్టుకుంది.