ప్రొ పంజా లీగ్‌‌‌‌‌‌‌‌ రన్నరప్​ హైదరాబాద్

ప్రొ పంజా లీగ్‌‌‌‌‌‌‌‌ రన్నరప్​ హైదరాబాద్

న్యూఢిల్లీ: ప్రొ పంజా ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్​ మొదటి సీజన్‌‌‌‌‌‌‌‌లో కిరాక్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  ఆదివారం జరిగిన  ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  28-–30 తేడాతో కొచి కెడిస్‌‌‌‌‌‌‌‌ చేతిలో పోరాడి ఓడింది. అండర్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నెగ్గి 2-–2తో సమంగా నిలిచాయి. మెయిన్​ కార్డులో స్టీవ్​ థామస్ (70 కేజీ), కెప్టెన్​ అస్కర్​ అలీ ( 80 కేజీ), సిద్దార్థ్​ (90 కేజీ) విజయాలు సాధించగా, మధుర (65 కేజీ), జిన్సీ జోస్  (+65 కేజీ)​, ఉజ్వల్‌‌‌‌‌‌‌‌ (+100కేజీ) ఓడిపోవడంతో స్కోరు 27–27తో సమం అయింది. టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌లో స్టీవ్​ 1–0తో రుద్ర నాయక్​పై గెలిచినా, చివరి మూడు మ్యాచ్​ల్లో అస్కర్‌‌‌‌‌‌‌‌ అలీ, మధుర, జిన్సీ జోస్ ఓడిపోవడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది.