
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ హీరోయిన్. సంజయ్ దత్ విలన్గా నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. రామ్ మాట్లాడుతూ ‘ పూరి గారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.
నాది మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. అలాగే ‘ఏదైనా మనకి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు’ అనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్లో జోష్ని నింపాడు రామ్.
ఈ సినిమా జర్నీ తనకు చాలా స్పెషల్ అని చెప్పింది కావ్య థాపర్. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తారు. సంజయ్ దత్ నటించడంతో కొత్త కలర్ వచ్చింది’ అని చెప్పాడు. నిర్మాత ఛార్మి, సీఈవో విష్, నటులు అలీ, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ పాల్గొన్నారు.