
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు. ఈ మూవీ జూన్ 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్, టీజర్ రిలీజై భారీ అంచనాలు పెంచేశాయి.
Theatres will thunder. ⚡️
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 1, 2025
Celebrations will erupt. 🥳🕺
Let’s celebrate Powerstar @PawanKalyan as #VeeraMallu like never before! 🔥#HariHaraVeeraMallu grand release worldwide this JUNE 12th! 🏹#HHVMonJune12th #HHVM #DharmaBattle pic.twitter.com/BaiZu9jjsy
అయితే, సినిమా రిలీజ్కు ఇంకా 10 రోజులే ఉండటంతో.. వీరమల్లు ట్రైలర్ ఇంకెప్పుడంటూ? సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత AM రత్నం లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
‘‘హరి హర వీరమల్లు ట్రైలర్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెండో భాగంలో సీజీ వర్క్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ట్రైలర్ రిలీజ్ ఆలస్యమైంది. ప్రస్తుతం సీజీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఆ పనులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని’’ నిర్మాత AM రత్నం తెలిపారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా పూర్తిచేయగా.. అనుకున్నదాని కంటే ముందుగానే (జూన్ ఫస్ట్ వీక్లో) వచ్చే ఛాన్స్ ఉందని AM రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ జూన్ 5న రిలీజ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాల సమాచారం.
►ALSO READ | అలీపై బూతులతో నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్ : మా మధ్య ఇది మాములే అంటూ కవరింగ్
ఇకపోతే.. రీసెంట్గా వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ ట్రైలర్ రిలీజ్ విషయంపై మాట్లాడారు. జూన్ ఫస్ట్ వీక్ లో హరి హర వీరమల్లు ట్రైలర్ వస్తుందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ కోస నార్త్ఇండియాలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే ట్రైలర్ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే, ట్రైలర్ లాంచ్ కోస నార్త్ఇండియాలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇకపోతే, పీరియాడిక్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందించారు. కోహినూర్ వజ్రం చుట్టూ స్టోరీ సాగుతుంది. ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో మొదటిభాగం తెరకెకిక్కించారు. మొఘలుల కాలం నాటి బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో మొఘలులకు సవాల్ విసిరే యోధుడు వీరమల్లు పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ . యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా, అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్వైడ్గా విడుదల కానుంది.