
గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘వర్జిన్ బాయ్స్’.దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మించారు. జులై 11న సినిమా రిలీజ్. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో హీరో గీతానంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
ఈ తరం యూత్ బయోపిక్లా ఉంటుంది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది అని ఇందులో చూపించబోతున్నాం.
అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐ ఫోన్లను గిఫ్ట్గా ఇస్తాం’అని చెప్పాడు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో ఆడియెన్స్పై డబ్బు వర్షం కురిపిస్తామని, సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా ఆ డబ్బును సొంతం చేసుకోవచ్చునని ప్రకటించారు.
ఈ మూవీ తనకు వెరీ స్పెషల్ అని హీరోయిన్ మిత్ర శర్మ చెప్పింది. కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించామని దర్శకుడు దయానంద్ అన్నాడు. ఎన్నో సర్ప్రైజ్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాత రాజా దరపునేని అన్నారు. నటులు శ్రీహన్, రోనిత్ తదితరులు పాల్గొన్నారు.