ఏడాదిన్నరలో రూ. 352 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు

ఏడాదిన్నరలో రూ. 352 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల్లో 69 మంది మృతి: ఫైర్స్ డీజీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.352 కోట్ల విలువ చేసే ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. 69 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని ఫైర్స్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. 2022లో స్టేట్​లో 7,368 ఫైర్​యాక్సిడెంట్లు జరిగాయని, అందులో 104 తీవ్రత ఎక్కువ ఉన్నవి, 7,129 తీవ్రత తక్కువవి నమోదయ్యాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.212 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. అలాగే, ఈ ఏడాది జూన్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,617 అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. అందులో 87 ఎక్కువ తీవ్రతలో జరగగా, 5,452 చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో రూ.140 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.