PT Usha: నా అకాడమీని ఆక్రమిస్తున్నరు

PT Usha: నా అకాడమీని ఆక్రమిస్తున్నరు

తన అథ్లెటిక్స్ ఆకాడమీని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లెజెండరీ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్, ఎంపీ పీటీ ఉష ఆరోపించింది. కేరళలోని, కోజికోడ్ సమీపంలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను పీటీ ఉష 2002లో స్థాపించింది. స్కూల్ కు కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పీటీ ఉష ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టారని వివరించింది. బీజేపీ తనను రాజ్యసభ కు నామినేట్ చేసిన తర్వాత కొందరు తనను టార్గెట్ చేశారని ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కేరళ సీఎంను ఉష కోరింది. ఈ అకాడమీ ద్వారా దేశవ్యాప్తంగా వేలాదిమందికి అథ్లెటిక్స్ లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది.