నవంబర్ 26న దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభ

నవంబర్ 26న దుబ్బాకలో ప్రజా ఆశీర్వాద సభ

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దుంపలపల్లి రోడ్డులోని పదెకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు యాభై వేల మంది జనాలను సమీకరించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ సభ దోహదం చేస్తుందని లీడర్లు భావిస్తున్నారు. శనివారం బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు.

వాహనాల్లో సభకు తరలింపు

దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గ వ్యాప్తంగా జనాలను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సమీప గ్రామాలవారికి ఆటోలు, దూర ప్రాంతాల వారికి పెద్ద వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.