ప్రజా ప్రతినిధులు గురుకులాలను విజిట్ చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

ప్రజా ప్రతినిధులు గురుకులాలను విజిట్ చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​సూచించారు. ఆర్సీవోలు కూడా స్కూల్స్​ ను విజిట్ చేసి​ రిపోర్టులు వెంటనే సెక్రటరీ సైదులుకు అందించాలన్నారు. 

బుధవారం బీసీ గురుకులాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడెక్కడ సొంత భవనాలు లేవో అక్కడ భూమి కేటాయించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. గన్నేరువరం స్కూల్​ ను తిమ్మాపూర్ నుంచి గన్నేరువరానికి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.