మందమర్రి వాసికి జర్నలిజంలో గోల్డ్​మెడల్

మందమర్రి వాసికి జర్నలిజంలో గోల్డ్​మెడల్

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి చెందిన రీసెర్చ్​ స్టూడెంట్ ​పూదరి హరీశ్ ​కుమార్​జర్నలిజం ఎంఫిల్​లో గోల్డ్​ మెడల్​ పొందాడు. బుధవారం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు యూనివర్శిటీ 16వ స్నాతకోత్సవంలో గవర్నర్​ డాక్టర్​తమిళసై, యూనివర్శిటీ వీసీ ఆచార్య తండెగ కిషర్​రావు చేతుల మీదుగా

గోల్డ్​ మెడల్​ అందుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజా సంబంధ ప్రచార ప్రభావం - తెలంగాణ రాష్ట్ర అధ్యయనం’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను హరీశ్​ ఈ అవార్డు అందుకున్నాడు.